రోజువారీ సర్వీసు నడపనున్న ట్రూజెట్
టికెట్ ధర రూ.1605
కడప: కడప – చెన్నై (మద్రాసు) నగరాల నడుమ ప్రతిరోజూ విమాన సర్వీసు నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం నవంబర్ 16వ తేదీ ఉదయం 9 గంటల 50 నిముషాలకు చెన్నై నుండి బయలుదేరి 10 గంటల 45 నిముషాలకు కడప చేరుతుంది.
అదే విమానం మధ్యాహ్నం 2 గంటల 10 నిముషాలకు కడప నుండి బయలుదేరి 03 గంటల 5 నిముషాలకు చెన్నై చేరుతుంది.
ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని ట్రూజెట్ ప్రారంభించింది. కడప – చెన్నైల మధ్య ముందస్తుగా టికెట్ కొనే వారికి ధరను రూ.1605 గా నిర్ణయించినారు.
ప్రతి రోజూ కడప – చెన్నైల మధ్య ఈ విమాన సర్వీసు నడిపేందుకు డిజిసిఏ (Director General of Civil Aviation) ట్రూజెట్ సంస్థకు అనుమతిని మంజూరు చేసింది. ఈ నేపధ్యంలో నవంబరు 16 నుండి కడప – చెన్నై సర్వీసు నడిపేందుకు సిద్ధమైనట్లు ట్రూజెట్ సంస్థ ప్రతినిధి ఒకరు కడప.ఇన్ఫో కు తెలియచేశారు.
http://www.trujet.com/ebooking/home/ మరియు ఇతర ట్రావెల్ వెబ్ సైట్ల ద్వారా కడప – చెన్నై (మద్రాసు) విమాన సర్వీసుకు టికెట్లు కొనుక్కోవచ్చు.