వైఎస్సార్ క్రీడాపాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు

40 మంది విద్యార్థులకు ప్రవేశం

కడప: జిల్లాలోని వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి మంగళవారం వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ తరగతి ప్రవేశానికి 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు.

ఎంపికల ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, జిల్లాస్థాయిలో డీఎస్‌డీవోలు ఎంపికలు నిర్వహిస్తారన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

చదవండి :  'సీమ కోసం సభలో నోరెత్తండి'

రాష్ట్రస్థాయి ఎంపికల్లో సత్తాచాటినవారికి కడపలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: