పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వివేకానందరెడ్డి భార్య లోక్ సభ ఎన్నికలలో ఎవరికి ఓటు వేశారని భావిస్తున్నారు?
లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే పులివెందులలో మొదటినుంచి జగన్ కే మెజార్టీ వస్తుందని, తనకు ఒక ఓటు, జగన్ మరో ఒటు వేస్తారని వివేకానందరెడ్డి చెబుతూవచ్చారు. అదే ప్రకారం మిగిలిన జనం సంగతి ఏమోకాని వివేకానందరెడ్డి భార్య మాత్రం నిజంగానే శాసనసభ ఎన్నిక వరకు తన భర్త వివేకాకు, లోక్ సభ ఎన్నికకు జగన్ ఓటు వేశారట.
ఆ విషయాన్ని ఒక టీవీ ఛానల్ కు ఆమ స్వయంగా చెప్పారట. అయితే ఇదే ప్రకారం వివేకా కూడా జగన్ కే ఓటు వేశారా అని కాంగ్రెస్ వర్గాలు చెవుల్లో గుగుసలాడుతున్నాయి.ఎంతైనా మా అబ్బాయి కదా అని జగన్ గురించి వివేకా అనడం విశేషం.
నిజమేనా….
వివేకా కుటుంబాన్ని నమ్మొచ్చా…