అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుమారు 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుంది.

ఇక్కడ శాస్త్రవేత్తల ద్వారా అరటిలోని అన్నిరకాలపై పరిశోధనలు చేస్తారు. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన రకం ఏది, తెగుళ్లను తట్టుకోవడంతో పాటు దిగుబడి నాణ్యత పెరిగేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండటంతో అరటికి వ్యాపించే తెగుళ్లు, ఇతర సమస్యలకు సత్వరం పరిష్కారం లభించనుంది.

చదవండి :  చింతకొమ్మదిన్నెలో 'కత్తి' సినిమా షూటింగ్

జూన్ 8న (సోమవారం) ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గండి క్షేత్రంలో ఈ పరిశోధనా కేంద్రానికి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.

కడప జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన అరటి రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇక్కడ అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

గండిక్షేత్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులతోపాటు ఈ పరిశోధన కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ భూమిపూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రం కార్యరూపం దాలిస్తే అరటిరైతులకు మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

చదవండి :  వివేకా పయనమెటు?

అరటి ఎగుమతులకు జిల్లాలోని పులివెందుల, రైల్వేకోడూరు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు.

ఇదీ చదవండి!

ఈనాడు పైత్యం

పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు చదివే పత్రికగా చెలామణి అవుతున్న ఈనాడు ఒక వార్తకు పెట్టిన హెడింగ్ ద్వారా మళ్ళా తన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: