ఉప ఎన్నికల ఫలితాలపై ‘ఆ ముగ్గురికే పట్టం’ పేరుతొ కడప జిల్లా టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించిన ఈనాడు దినపత్రిక అందులో ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. ఈనాడు కధనం ప్రకారం రాయచోటి, రాజంపేట, రైల్వేకొడూరులలో తెదేపా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు ఓటుకు ఐదు వందలనుంది వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్తులు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కాంగ్రెస్, తెదేపా అభ్యర్తులు బాగా నగదు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు గంప గుత్తగా వైకాపాకు ఓటేశారని కూడా పేర్కొంది. ఈనాడు కధనం నిజమైతే కడప జిల్లా ఓటర్లు డబ్బు తీసుకుని మరీ కాంగ్రెస్, తెదేపాలకు షాకిచ్చారన్న్నమాట!
ఇదీ చదవండి!
కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి
రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.