యుపిఎ-2 ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న మరునాడే ‘పెట్రో మంట రూపంలో సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే ప్రజలపై పెను భారం మోపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు రు.6.28 వంతున పెంచు తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. వ్యాట్, ఇతర పన్నులు కలిపి ఆయా రాష్ట్రాల్లో రూ.7.50 నుండి రూ.8.50 వరకు పెరగనుంది. గత ఆరు నెలల్లో పెట్రో లు ధర పెంచడం ఇది రెండోసారి.
బుధవారం అర్థరాత్రి నుండే అమలులోకి వచ్చిన ఈ ధర పెంపుదలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.