డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9 గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.