కడప: పెండ్లిమర్రి మండలంలోని మొయిళ్లకాల్వ గ్రామంలో వెలసిన హజరత్ హుస్సేని వల్లీదర్గాలో శుక్రవారం ఉరుసు ఉత్సవం జరుగుతుందని దర్గాకమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి 9గంటలకు గంధం, శ్రీనివాసరావు బృందంచే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర నాటకం ఉంటుందని, రాత్రి అన్న సంతర్పణ నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. 10గంటలకు పూలచాందినితో గ్రామపురవీధుల్లో …
పూర్తి వివరాలుబేస్తవారం నుంచి నీలకంఠరావుపేట ఉరుసు
రాయచోటి: రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట దర్గాలో గురువారం నుంచి హజరత్ దర్బార్ అలీషావలి (రహంతుల్లా అలై), జలీల్ మస్తాన్వలీ ఉరుసు నిర్వహించనున్నట్లు సద్గురు దర్గా స్వామిజీ చెప్పారు. 5న గంధం, 6న జెండా మెరవణి, 7న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందూ-ముస్లిం సమైక్యతకు చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా నీలకంఠరావుపేట దర్గా …
పూర్తి వివరాలుఈ రోజూ రేపూ కమలాపురం చిన్నదర్గా ఉరుసు
కమలాపురం: స్థానిక డిగ్రీకళాశాల రోడ్డులోని శ్రీహజరత్ మహబూబ్ సుబహానీ అబ్దుల్ఖాదర్ జిలాని గార్ల చిన్నదర్గా గంధం, ఉరుసు కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు సుబహానీ దర్గా కమిటి ఒక ప్రకటనలో తెలియచేసింది. ఈ పందర్బంగా శుక్రవారం రాత్రి దస్తగిరి స్వాముల జెండా ఊరేగింపు, గంధం, మెరమణి డప్పులు, వాయిద్యాల మధ్య పురవీధుల్లో …
పూర్తి వివరాలుఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు
కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాలుఏఆర్ రెహమాన్ కడపకొచ్చినాడు
కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్పీర్ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్ అమీనుల్లా మహ్మద్ మొహమ్మదుల్ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద …
పూర్తి వివరాలురేపూ…మన్నాడు ఆస్థానే మురాదియాలో ఉరుసు ఉత్సవాలు
కడప: స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ దగ్గర గల హజరత్ ఖ్వాజా సయ్యద్షామొహర్ అలీ (మొరి సయ్యద్సాహెబ్ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్ నమాజ్ …
పూర్తి వివరాలుజమ్మలమడుగులో 30 నుండి గూడు మస్తాన్ వలీ ఉరుసు
జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణానికి పడమటి దిశగా పవిత్ర పినాకినీ నదీ తీరంలో క్రీ.శ. 1651 సంవత్సరంలో శ్రీ హజరత్ గూడు మస్తాన్ వలీ వారు సమాధియై ఉన్నారు. ఆయన పేరుమీద ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లిం సోదరులు సమైక్యతకు ప్రతీకగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుపుకోవడం …
పూర్తి వివరాలుకమలాపురం ఉరుసు ముగిసింది
కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్తో ప్రారంభం కాగా గురువారం తహలీల్తో ముగిశాయి. గురువారం ఉదయం దర్గా ఫీఠాధిపతి గఫార్స్వామి ఆధ్వర్యంలో గంధం ఇంటి నుంచి వూరేగింపుగా గంధాన్ని, పూలను తీసుకువచ్చి దర్గాలో ఎక్కించారు. నషాన్ సందర్భంగా దర్గాలో ప్రతిష్ఠించిన జెండాను కిందికి దించారు. స్వామి …
పూర్తి వివరాలుఈ రోజు నుంచి కమలాపురం ఉరుసు
హిందూ, ముస్లింల సమైక్యత ప్రతీక కమలాపురం శ్రీహజరత్ అబ్దుల్ గఫార్షా ఖాద్రి, దస్తగిరి ఖాద్రి, మౌలానామౌల్వి ఖాద్రి, మొహిద్దీన్షా ఖాద్రి, జహిరుద్దీన్షాఖాద్రి దర్గా . నేటికీ ఇక్కడ హిందువులే ధర్మకర్తలు. దర్గాను దస్తగిరిషా ఖాద్రి శిష్యుడు, పొద్దుటూరుకు చెందిన నామా నాగయ్య శ్రేష్ఠి నిర్మించారు. నేటివరకూ వారి కుటుంబికులే ధర్మకర్తలుగా సేవలందిస్తున్నారు. హజరత్ అబ్దుల్గఫార్షా …
పూర్తి వివరాలు