సిపిఎం

ఉక్కు పరిశ్రమను తరలిస్తే అడ్డుకుంటాం : సిపిఎం

కడప: రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి తరలించాలనుకోవడం బాధాకరమని సీపీఎం రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే జిల్లాకు కేటాయించిన ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్‌డీవో రక్షణ రంగం ప్రాజెక్టు ఇతర జిల్లాలకు తరలించారన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.

చదవండి :  దీక్ష విరమించిన కమలాపురం శాసనసభ్యుడు

ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, పశ్చిమగోదావరి జిల్లాకు తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.  ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: