తాత్కాలిక రాజధాని కుట్రే!

బాబు మాటల మరాటీ అయితే వెంకయ్య మాయల మరాటీ 

విజయవాడను తాత్కాలిక రాజ ధానిగా చంద్రబాబు ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాధన కోసం పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీగా ఏర్పడాలని ఆయన సూచించారు. మంగళవారం కడపలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ సీమ వాసులు నాడు మద్రాసును, కర్నూలు రాజధానిని, నేడు హైదరాబాదును త్యాగం చేశారని వివరించారు. ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇంకా అట్టడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి :  ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువైన ఎర్రచందనం వైఎస్సార్ జిల్లాలో ఉందని, దీనిని ఈ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘సీమ’ ప్రాంతానికి చెందిన 52 మంది శాసనసభ్యులతోపాటు నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు తమ భవిష్యత్తు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ‘సీమ’లో రాజధాని సాధన కోసం తమవంతు కృషి ఉంటుందన్నారు.

చదవండి :  'పెన్నేటి పాట'కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

సీపీఐ నేత రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలను వ్యతిరేకం కాదని బిజెపి తెలిపిందని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. బాబు మాటల మరాటీ అయితే వెంకయ్య మాయల మరాటీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, డాక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంిపీటీసీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: