తెదేపాకు మదన్ రాజీనామా

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజంపేట మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అప్పటి నుంచి టీడీపీలో మదన్ అంటీ అంటనట్లుగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆయన పట్ల చంద్రబాబునాయుడు మొగ్గుచూపలేదు. మదన్‌తోపాటు బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు.

చదవండి :  పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

ఈనేపథ్యంలో ఇటీవల తన వర్గీయులతో మదన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మేడా రాకపోవడంతో అలక చెందారు. అనంతరం మేడా స్వయంగా వచ్చి సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు చెప్పుకున్నారు.  సోమవారం కూడా టీడీపీ అభ్యర్ధి మేడా మల్లికార్జునరెడ్డి వెంట పట్టణంలోని నారపురెడ్డిపల్లె ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: