ప్రొద్దుటూరులో తమిళనాడు గవర్నర్

ప్రొద్దుటూరు: స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి చేయించిన వజ్రకిరీట సంప్రోక్షణ కార్యక్రమంలో శుక్తరవారం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. 10.50 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు చేరుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.

అక్కడినుంచి ఆయన ప్రత్యేక వాహనంలో ఆర్ అండ్ బీకి చేరుకున్నారు. అక్కడ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సీ.రామచంద్రయ్య తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన అమ్మవారిశాలకుచేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు.

చదవండి :  జూన్ ఆఖరుకు కడప విమానాశ్రయం సిద్ధం

అనంతరం పెన్నాతీరంలో ఉన్న అమృతేశ్వరాలయానికి వెళ్లారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత ఆయన పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గోన్నారు. మద్యాహ్నం ఆర్ అండ్ బీ అతధి భవనానికి చేరుకుని భోజనం చేసి, విరామం అనంతరం తిరిగి తమిళనాడుకు తిరిగి వెళ్లారు.

ఇదీ చదవండి!

బాబురావు నాయుడు

కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: