ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నలుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.
శనివారం సాయంత్రం వరకు ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …
1 రాచమల్లు శివప్రసాద్ రెడ్డి – వైకాపా
2 రాచమల్లు రమాదేవి – వైకాపా
3 నంద్యాల వరదరాజులురెడ్డి – తెదేపా
4 నంద్యాల కొండారెడ్డి – తెదేపా
5 నూకా వెంకట శానమ్మ – జైసపా
6 నూకా నాగేంద్రరెడ్డి – జైసపా
7 గొర్రె శ్రీనివాసులు – కాంగ్రెస్
8 రాచమల్లు గురుప్రసాద్ రెడ్డి – వైఎస్సార్ బహుజన పార్టీ
9 వంగనూర్ గురప్ప – వైఎస్సార్ ప్రజా పార్టీ
10 దనిరెడ్డి ప్రసాద్ రెడ్డి – సమాజ్ వాది సమాజ్ పార్టీ
11 చౌటపల్లి సుజనాదేవి – పిరమిడ్ పార్టీ
12 పాతకోట బంగారుమునిరెడ్డి – నేకాపా
13 ఉప్పలూరు షేక్ మునావర్ హుస్సేన్ – మజ్లిస్ బచావో తహరీక్
14 ఆది సూర్యనారాయణ – లోక్ సత్తా
15 కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి – జెడియు
16 మార్తల వెంకటదైవప్రసాద్ రెడ్డి – భారతీయ వైకాపా
17 పెట్లు శ్రీనివాసులు – బసపా
18 నల్లమల ఓబులేసు – బసపా
19 బండి శ్రీహరి – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్
20 కె సునీల్ సాగర్ – ఆప్
21 మాదాసు మురళీమోహన్ – స్వతంత్ర అభ్యర్థి
22 లింగారెడ్డి. మల్లేల – స్వతంత్ర అభ్యర్థి
23 లక్ష్మీప్రసన్న. మల్లేల – స్వతంత్ర అభ్యర్థి
24 కానాల సామేల్ – స్వతంత్ర అభ్యర్థి