బాబు రేపు జిల్లాకు రావట్లేదు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కడప జిల్లా పర్యటన రద్దయింది. ఈనెల 14న రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సభాస్థలి, హెలిప్యాడ్‌ స్థలాలను ఖరారు చేశారు.

జిల్లా అధికారులు, టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబు పర్యటనలో జిల్లాపై వరాలజల్లులు కురిపిస్తారని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. అయితే హుద్‌హుద్‌ తుఫాన్‌ కారణంగా వైజాగ్‌, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. దీంతో తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంతో పాటు సహాయ చర్యల కోసం చంద్రబాబు వైజాగ్‌కు వెళ్తున్నారు. దీంతో జిల్లాలో జన్మభూమి కార్యక్రమం రద్దయింది. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది.

చదవండి :  మైదుకూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: