మొదలైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన 17 మండలాల్లో 217 పంచాయతీ సర్పంచ్‌లకు, 1648 వార్డులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

చదవండి :  ఈ రోజు నుంచి పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

చక్రాయపేట మండలం బురుజుపల్లిలో వైసీపీ-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: