కడప : జిల్లా లో ఎన్నికల ప్రచారంలో చిరంజీవితో కలిసి అభ్యర్దులు డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డిలు పాల్గొన్నారు. చక్రాయపేటలో జరిగిన ఈ పర్యటనలో చిరంజీవి స్టార్ స్పీకర్.
మంత్రులు రవీంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆయనతోపాటు ఉన్నారు.కాని చిరంజీవే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. వీరంతా కలిసి పర్యటిస్తుంటే తులసీరెడ్డిని ఎవరూ పట్టించుకోకపోవడం ఆయనకు బాద కలిగించింది. ఆయా నేతలు కనీసం తన పేరు కూడా ప్రస్తావించకపోవడంతో ఆయన అలిగి వెళ్లిపోబోయారు. అయితే వివేకానందరెడ్డి ఆయనను బతిమిలాడాల్సి వచ్చింది.
కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న డాక్టర్ ఎన్.తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఇరవై సూత్రాల పధకం అమలు కమిటీ ఛైర్మన్ గా క్యాబినెట్ హోదాలో ఉన్న నేత. గతంలోజడ్పి ఛైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.
క్యా బాత్ హై…. తులశన్న సీరియస్
నలుగు పెట్టండి పెద్ద సారుకి.
he is thinking about himself as very popular leader.But he did not knew that he is a small street level leader.
I agree with you
These bloody politicians are back stabbers to YSR family.