‘సీమ కోసం సభలో నోరెత్తండి’

కడప:  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పోరాడాలన్నారు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

చదవండి :  అమ్మాయిలను విక్రయించే ముఠా గుట్టు రట్టు !

ఈ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్దన్, ఉపాధ్యక్షుడు జకరయ్య, నాయకులు మల్లికార్జున, సుబ్బరాజు, నాగరాజు, నాయక్, ప్రసన్న తదితరులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి!

అస్థిత్వం

అస్థిత్వం – డా.ఎం.వి.మైసూరారెడ్డి

పుస్తకం : ‘అస్థిత్వం’,  రచన: డా.ఎం.వి.మైసూరారెడ్డి (మాజీ మంత్రి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : అక్టోబర్ 2018లో ప్రచురితం.  ప్రతులకు :  …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: