కడప : ఎండలకాలం మొదలవుతున్నందున సోమవారం ( 16 మార్చి) నుంచి ఒంటిపూట బడి నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రతాప్రెడ్డి తెలిపారు.
ఉదయం 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.
డీఎడ్, పదోతరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరపాలన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని డీఈవో తెలిపారు.