ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన రహస్యం!

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన తండ్రి అమరనాధరెడ్డి రాజకీయాలలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి కన్నా సీనియర్ అని , వై.ఎస్.తండ్రి రాజారెడ్డి ఒకసారి జైలులో ఉంటే అమరనాధరెడ్డి విడిపించారని కిరణ్ చెప్పడం విశేషం.ఉపఎన్నికల ప్రచారంలో ఈ విషయం చెప్పడం ద్వారా కిరణ్ వైఎస్ కుటుంబం కంటే తమ కుటుంబం గొప్ప అని చెప్పదలుచుకున్నారా! లేక వ్యూహాత్మకంగా వైఎస్ కుటుంబానికి నేరచరిత్ర ఉందని చెప్పదలుచుకున్నారా!

చదవండి :  సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసిన సిబిఐ! - ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందే సిద్ధమైన జగన్?

జగన్ విషయంలో కూడా గతంలో శాసనసభలో తాను వాదించానని చెప్పిన కిరణ్ ఇప్పుడు తన తండ్రి రాజశేఖరరెడ్డి తండ్రిని రక్షించారని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి ఎలా స్పందిస్తారో?

కాగా పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మారతారని కొందరు వ్యాఖ్యానించడం అవగాహన లోపం అని అన్నారు. మాజీ మంత్రి శంకరరావు రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పిన నేపధ్యంలో బొత్స ఈ వ్యాఖ్య చేశారు.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేయడాన్ని బొత్స సమర్ధించారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: