వార్తలు

కవయిత్రి మొల్ల – మా ఊరు

కవయిత్రి మొల్ల

చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని. దంచిన వడ్లు చాటలతో చెరిగి …

పూర్తి వివరాలు

అక్టోబరు 30 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు : యోవేవి

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

కడప : అక్టోబరు 30 నుంచి యోవేవి అనుబంధ కళాశాలలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. 30న ప్రారంభమై నవంబరు 21 వరకు సెమిస్టర్‌  పరీక్షలు జరుగుతాయి.

పూర్తి వివరాలు

కడప ఎస్పీగా అన్బురాజన్‌

అన్బురాజన్‌

కడప : వైఎస్సార్‌ జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయిన అన్బురాజన్‌ శుక్రవారం కడపలో విధుల్లో చేరారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని …

పూర్తి వివరాలు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

పుట్టపర్తి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య …

పూర్తి వివరాలు

వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ

వజ్రాల గని

కడప : ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో శుక్రవారం అధికారులు వజ్రాల గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఊరికి సమీపంలోని కొండ ప్రాంతంలో 45.649 హెక్టార్లలో వజ్రాల ముడి ఖనిజం (క్వార్ట్జ్‌) గనుల ఏర్పాటుకు షేక్‌ అల్లాహ్‌ మహమ్మద్‌ భక్షి అనే మైనింగ్ వ్యాపారి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని …

పూర్తి వివరాలు

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

శ్రీనాథ్‌రెడ్డి

కడప : సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి …

పూర్తి వివరాలు

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ …

పూర్తి వివరాలు

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

బస్సు ప్రయాణం

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ …

పూర్తి వివరాలు

మాధవరంపోడులో గబ్బిలాలకు పూజలు

మాధవరంపోడు

మాధవరంపోడు –  కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కడప – రేణిగుంట రహదారిని ఆనుకుని ఉన్న ఒక  గ్రామం. ఏంటీ ఊరు ప్రత్యేకత ?  జిమ్మటాయిలకు (గబ్బిలాలు), వాటి ఆవాసాలైన చెట్లకు ఈ ఊరోళ్లు పూజలు చేస్తారు. ఎందుకలా ? గబ్బిలాలకు పూజలు చేస్తే రోగాలు తగ్గిపోతాయని, పక్షి దోషం పోతుందని మాధవరంపోడో ల్ల  …

పూర్తి వివరాలు
error: