కోవరంగుంటపల్లె: ప్రముఖుల పుట్టినిల్లుగా పేరొందిన కోవరంగుంటపల్లెకు స్వాతంత్య్ర సమర యోధుల గడ్డగా కూడా పేరుంది. కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి స్వగ్రామం ఇదే. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన ఇంగ్లాండ్లో బారిష్టర్ చదివారు. గాంధీ ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. …
పూర్తి వివరాలుబ్రహ్మణి స్టీల్స్ను ఆపొద్దు …
కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన …
పూర్తి వివరాలుజిల్లాపై వివక్ష తగదు : సీపీఎం
బద్వేలు: వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం పాలకులు రాజకీయ కుట్రలతోనే జిల్లాకు నిధులను నిలిపివేశారని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతలు ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ 8వ జిల్లా మహాసభలు గురువారంతో ముగిసాయి. …
పూర్తి వివరాలుగండికోటలో 274 కోట్ల తో పవన విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్న” నాల్కో”
నేషనల్ అల్యూమియం కంపెనీ లిమిటెడ్ ( నాల్కో ) వై.ఎస్.ఆర్ జిల్లా లోని గండికోటలో 274 కోట్ల రూపాయల వ్యయంతో 50.4 ఎం.వి. పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 274 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తుందని నాల్కో సి.ఎం.డి బాగ్రా భువనేశ్వర్ లో …
పూర్తి వివరాలు16 వ తేదీ నుండి 18 వరకు దొమ్మర నంద్యాలలో జ్యోతి ఉత్సవాలు
మైలవరం: కోరిన వారికి కొంగు బంగారంగా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 16 వ తేదీ ఆదివారం నుండి 18 వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 16 వ తేదీ బిందుసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, …
పూర్తి వివరాలుజగన్ పై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. రహ్మతుల్లా …
పూర్తి వివరాలు9 నుంచి 11 వరకు కడపలో జగన్
కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …
పూర్తి వివరాలు9న ప్రొద్దుటూరుకు రానున్న ముఖ్యమంత్రి
ప్రొద్దుటూరు: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రొద్దుటూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ బుధవారం సాయంత్రం స్థానిక అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. మొదట గోపవరం గ్రామ పంచాయతీలోని కొర్రపాడు రోడ్డు రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపెరల్ పార్కు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, తర్వాత …
పూర్తి వివరాలుకోరవాని పల్లెలో గొర్రెల కాపరుల వింత ఆచారం
గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలు
పూర్తి వివరాలు