వార్తలు

తెదేపా పరిస్థితి దయనీయం

కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభనియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సైకిల్‌ పంక్చర్ అయ్యింది. ఫ్యాన్‌ హోరుకు సైకిల్‌ ఎదురు నిలువలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెదేపా నియోజకవర్గ బాధ్యులు రామసుబ్బారెడ్డి డిపాజిట్ దక్కే స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. కడప, మైదుకూర్‌, బద్వేల్‌ నియోజకవర్గాల్లో తెదేపా అత్యంత దయనీయమైన స్థితికి పడిపోయింది.

పూర్తి వివరాలు

విజయమ్మకు 81వేల 373 ఓట్ల మెజార్టీ

పులివెందుల : పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంతో కొనసాగిన విజయమ్మ ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 81వేల 373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. …

పూర్తి వివరాలు

జగన్ మెజార్టీ 5,45,672 ఓట్లు

కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం …

పూర్తి వివరాలు

సివిల్స్‌లో జిల్లా వాసుల ప్రతిభ

జిల్లాలోని లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన చప్పిడి సుష్మారెడ్డి సివిల్స్‌లో 96వ ర్యాంకు సాధించారు. సుష్మా సోషియాలజి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక సబ్జెక్ట్‌లు ఎంచుకొని ఈ ర్యాంకు సాధించారు. కడప నిర్మల స్కూల్‌లో 9, నాగార్జున హైస్కూల్‌లో 10వ తరగతి చదువుకున్నారు. విజయవాడ నలంద కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి వరంగల్‌లో …

పూర్తి వివరాలు

వెంకటేశ్వరస్వామికి ఆస్తులు రాసివ్వాలి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ …

పూర్తి వివరాలు

నేను మాట్లాడితే తప్పా?

ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నియంతలా వ్యవహరించారని కడప కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. నిబంధనలను పట్టుకొని వాటికనుగుణంగా వ్యవహరించారు తప్పితే తాము చెప్పింది ఎంతమాత్రం వినిపించుకోలేదని, చివరకు రిగ్గింగ్ ఆరోపణలను సైతం పట్టించుకోలేదని ఆయన తన హోదాకు తగినట్లుగా ఆయన వ్యవహరించి ఉండాల్సిందని, …

పూర్తి వివరాలు

జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ?

పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వివేకానందరెడ్డి భార్య లోక్ సభ ఎన్నికలలో ఎవరికి ఓటు వేశారని భావిస్తున్నారు?   లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే పులివెందులలో మొదటినుంచి జగన్ కే మెజార్టీ వస్తుందని, తనకు ఒక ఓటు, జగన్ మరో …

పూర్తి వివరాలు

కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం పోలింగ్

కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాజాగా అందిన వివరాల ప్రకారం సుమారు పదిలక్షల ఓట్లు పోలయ్యాయి.అంటే మొత్తం కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం ఓట్లు పోలైనట్లు నమోదైంది. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానంలో జమ్మలమడుగు సెగ్మెంట్ ఉంది. …

పూర్తి వివరాలు

కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

వైఎస్‌ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి …

పూర్తి వివరాలు
error: