రాజంపేట: విప్ను ధిక్కరించి తెదేపాకు ఫిరాయించిన రాజంపేట మండలపరిషత్తు అధ్యక్షురాలు సుహర్లతపై అనర్హత వేటు పడింది. ఈమె ఏప్రిల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండలంలోని వూటుకూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరుపున పోటీచేసి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో తెదేపా ప్రలోభాలకు లొంగి ఈమె వైకాపా నుండి ఫిరాయించి లాటరీ పద్ధతిలో …
పూర్తి వివరాలుఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు
రాయచోటి : మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా విప్ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరసింహులునాయక్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్ మహబూబ్బాష, 21వ వార్డు కౌన్సిలర్ షాహిరున్నీసాలపైన ఈ …
పూర్తి వివరాలుజమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే
జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా తులశమ్మ(వైకాపా), వైస్ ఛైర్మన్గా ముల్లా జానీ (తెదేపా)ఎన్నికయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎంపిక చేశారు. తెదేపా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో అధిక …
పూర్తి వివరాలుపాలకవర్గాలు ఏర్పడినాయి!
కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా …
పూర్తి వివరాలుజమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు
కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ …
పూర్తి వివరాలుతెదేపా వ్యూహాలకు బ్రేకులు పడ్డట్లే!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిన్నటి వరకు నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉన్న వైకాపా ఇటీవల జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆ …
పూర్తి వివరాలువైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్
వైకాపా శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఈ రోజు (బుధవారం) జరిగిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. …
పూర్తి వివరాలురాజంపేట పార్లమెంటు స్థానంలో ఎవరికెన్ని ఓట్లు
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్సభ స్థానం నుండి పోటీ …
పూర్తి వివరాలుమర్నాడు ఇడుపులపాయలో వైకాపా శాసనసభాపక్షం సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తొలి సమావేశం ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నారు.ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినప్పటికీ తొలి సమావేశంలో పార్టీకి స్ఫూర్తిప్రదాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పించి ప్రారంభించాలన్న అభిప్రాయం మేరకు సమావేశం వేదికను ఇడుపులపాయకు మార్చారు. 21వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే ఈ …
పూర్తి వివరాలు