‘అనంతపురంతో పాటు వైఎస్సార్జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ …
పూర్తి వివరాలు'కడప జిల్లా'కు శోధన ఫలితాలు
మత్తులో జోగిన రాయలసీమ ముఖ్యమంత్రులు
“అధికారం లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు. ఈ మాటలు రాయలసీమ నాయకులకు అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే వారికి అధికారం కావాలి కానీ అక్కడి …
పూర్తి వివరాలుతెదేపా వైపు వరద చూపు ?
ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా …
పూర్తి వివరాలుఅరుదయిన పునుగుపిల్లి దొరికింది!
కడప: జిల్లాలోని నందలూరు మండలం పాటూరు గ్రామ పొలంలో గురువారం పిల్లి జాతికి చెందిన అరుదయిన పునుగుపిల్లి దొరికింది. గ్రామానికి చెందిన రైతు కోటకొండ సుబ్రహ్మణ్యం తాను సాగుచేసిన కర్భూజ పంటను పందులు, పందికొక్కులు నాశనం చేయకుండా బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో పునుగుపిల్లి చిక్కుకొంది. పాటూరు మాజీ సర్పంచి గాలా …
పూర్తి వివరాలుఎందుకింత చిన్నచూపు?
దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి …
పూర్తి వివరాలుచంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్
కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత …
పూర్తి వివరాలు1,050 మెగావాట్ల కరెంటు తయారీ ఆగింది!
ఉద్యోగుల సమైక్య సమ్మె నేపధ్యంలో రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ)లో మూడు రోజులుగా కరెంటు తయారీ ఆగిపోయింది. కడపతోపాటు, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎంతో కీలకమైన ఈ కేంద్రం మూడు రోజులుగా పడకేసింది. అయిదు యూనిట్లలో 1,050 మెగావాట్ల కరెంటు తయారీ నిలిచిపోయింది. ఇంజినీర్లు, ఉద్యోగులంతా సమ్మె కారణంగా విధులకు హాజరుకామంటూ కరాఖండిగా …
పూర్తి వివరాలువిభజన జరిగితే ఎడారే
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి …
పూర్తి వివరాలుఈ రోజు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సమైక్య గర్జన
సమైక్య ఉద్యమ తీవ్రత తెలియచేప్పెందుకు రెండు లక్షల మందితో చేపట్టనున్న సమైక్య గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన ప్రవాహం కదిలిరానున్నందున ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కడప కళాశాల మైదానంలో ఈ రోజు (శనివారం) ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికప్రతినిధులు సమాయత్తమయ్యారు. ‘సమైక్య గర్జన’ నిర్వహణ స్థలం విషయంలో …
పూర్తి వివరాలు