సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసిన సిబిఐ! – ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందే సిద్ధమైన జగన్?

ఉపఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో సాక్షి టివీ, సాక్షి పత్రికల భ్యాంకు ఖాతాలను సిబిఐ స్థంభింపచేసింది. ఇది కుట్రపూరితం అని, ప్రజాస్యామ్యంపై దాడి అని కంపెనీ అధినేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ తీవ్రంగా ఖండించారు. అయితే అధికార కాంగ్రెస్, విపక్ష తెదేపాలు సిబిఐ చర్యను సమర్థించడం విశేషం. జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి ఉద్యోగులు అధైర్యపడవద్దని అన్నారు.

చదవండి :  కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే రోజులలో టీవీ, పత్రిక నడపడం కష్టం అయ్యేలా వ్యూహాన్ని అమలు చేయవచ్చని, తద్వారా జగన్ మరిన్ని సమస్యలు ఎదుర్కోవచ్చని అంటున్నారు.

ys jagan

ఉప ఎన్నికలలో దీని ప్రభావం వలన జగన్ కు ఇంకా సానుభూతి పెరిగి అది మరింత ఘన విజయానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే జగన్ కేసుతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అంటున్నారు.

చదవండి :  రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన

ఇటీవలి కాలంలో సాక్షి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేస్తున్నదని ,అందువల్ల కాంగ్రెస్ హై కమాండ్ దానిని దెబ్బతీయడానికి ఈ చర్య చేపట్టి ఉండవచ్చని కూడా అంటున్నారు.గతంలో ఇలా సాక్షి బ్యాంకు ఖాతాలను సీజ్ చేయవచ్చని కధనాలు వచ్చాయి.

ఇదీ చదవండి!

ఆయనకు దమ్ము, ధైర్యం లేదా?

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు సీబీఐని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. రాజంపేటలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: