కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : 132 ఏళ్ళు
భవన నిర్మాణ వ్యయం అప్పట్లో కేవలం 2 లక్షల 50 వేల రూపాయలు మాత్రమే.
బ్రిటీష్ రాజరిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
స్వాతంత్య్రం రాక ముందు 65 మంది కలెక్టర్లు, స్వాతంత్య్రం వచ్చిన తరువాత 44 మంది కలెక్టర్లు ఈ భవనం నుంచి తమ విధులను నిర్వర్తించారు .
1889 లో ఇ.జె. సెవెల్ కడప జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈభవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు.
2008 లో ఎం.టి. కృష్ణబాబు కలెక్టర్ గా ఉన్న సమయంలో జిల్లాకు చెందిన డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప రైల్వే స్టేషన్ సమీపంలో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించడంతో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొత్త భవనల్లోకి తరలించారు.
పాత కలెక్టరేట్ భవనాన్ని జిల్లా చరిత్ర, పురావస్తుశాలగా ప్రకటిస్తే జిల్లా సాంస్కృతిక వైభవం భావితరాలకు అందించినట్లవుతుంది.