బొత్సతో కందుల సోదరుల చర్చ

కడప : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసిన వారి జాబితాలో తాజాగా కందుల సోదరులు చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బొత్సను కలిసి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికి డీసీసీ పదవి కట్టబెట్టాలని కోరారు.

కడప అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన బొత్స స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయాలకు కృషి చేయాలని సూచించారు. బొత్సను కలిసిన వారిలో లేబాకు మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చదవండి :  కడప, ప్రొద్దుటూరుల్లో సిటీ బస్సులు

ఇదీ చదవండి!

అల్లరి నరేష్

కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప: కథానాయకుడు ‘అల్లరి’ నరేష్ ఈ రోజు (ఆదివారం) కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: